దళితుల అభివృద్ధికి బాలనాధం కృషి చేయాలి

దళితుల అభివృద్ధికి బాలనాధం కృషి చేయాలి

దళితుల అభివృద్ధికి జాతీయ మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు ఆవుల బాలనాధం కృషి చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆదివారం గన్​ ఫౌండ్రిలో నిర్వహించిన సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో మాలల ఐక్యత కోసం పోరాడిన బాలనాధాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివని, ఆయన చూపిన దారిలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు.