జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు , మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ధర్మారం, వెల్గటూర్ పట్టణాల్లో వివేక్ కు ఘన స్వాగతం పలికారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేసి.. శాలువతో సత్కరించారు అర్చకులు. ధర్మపురి మండలం దమ్మన్నపేట్, కోసునూరుపల్లె, జైన , దొంతాపూర్ గ్రామాల్లో బీజేపీ జెండా ఆవిష్కరించారు వివేక్ వెంకటస్వామి.