
న్యూఢిల్లీ: ‘మోదీ ఇంటి పేరు’ వ్యవహారంలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు పెట్టిన బీజేపీ నేతకు కీలక పదవి దక్కింది. రాహుల్పై సూరత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పూర్ణేశ్ మోదీని దాద్రానగర్ హవేలీ -డామన్ డయ్యూలో పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జీగా అధిష్ఠానం నియమించింది. మరో నేత దుష్యంత్ పటేల్కు కో- ఇన్ఛార్జీగా పదవి ఇచ్చింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2019లో కర్నాటకలోని కొల్లార్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ‘మోదీ ఇంటి పేరు’ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో రాహుల్పై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసును విచారించిన న్యాయస్థానం రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో మరుసటి ఆయనపై అనర్హత వేటు పడి, లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. సుప్రీం స్టే విధించడంతో.. రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.