ప్రజల పక్షాన బీజేపీ ఎప్పుడూ పోరాడుతుంది

ప్రజల పక్షాన బీజేపీ ఎప్పుడూ పోరాడుతుంది

దుబ్బాక, వెలుగు: ఎనిమిదేండ్లుగా గ్రామాభివృద్ధిని పట్టించుకోలేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్​ పాటించడం లేదని ఆరోపిస్తూ శనివారం సిద్దిపేట జిల్లా భూంపల్లి- అక్బర్​పేట మండల కేంద్రంలో ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిని బీజేపీ లీడర్లు అడ్డుకున్నారు. గ్రామంలో డబుల్​ బెడ్రూమ్​ఇండ్ల సమస్యను పరిష్కరించాలని, గ్రామంలో దళితబంధు పథకాన్ని ప్రకటించాలని డిమాండ్​ చేశారు. అంగన్​వాడీ కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎంపీకి ప్రోటోకాల్​ తెలియదా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే లేకుండా అంగన్​వాడీ కేంద్రాన్ని ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. ఎంపీని అడ్డుకున్న బీజేపీ లీడర్లు బాలిశెట్టి శ్రీనివాస్​గౌడ్, నరేశ్, శ్రీకర్, లింగం గౌడ్​ను పోలీసులు అరెస్ట్​ చేసి భూంపల్లి పోలీస్​స్టేషన్​కు తరలించారు. గ్రామాల అభివృద్ధిపై ప్రశ్నిస్తే పోలీస్​లు అరెస్ట్​ చేయడమేంటని లీడర్లు ప్రశ్నించారు. ప్రజల పక్షాన బీజేపీ ఎప్పుడూ పోరాడుతుందని అన్నారు.