
- స్టూడెంట్స్ తో కలిసి ధర్నా చేసిన బీజేపీ నాయకులు
అయిజ, వెలుగు: అయిజకు డిగ్రీ కాలేజీ బాలికల జూనియర్ కాలేజీ మంజూరు చేయాలని బీజేపీ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జూనియర్ కాలేజీ ఎదుట పార్టీ శ్రేణులు, ఇంటర్ విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు.15 సంవత్సరాలుగా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.
ఏడాది గడిచినా డిప్యూటీ సీఎం, ఎంపీ మల్లు రవి ఎన్నికల్లో ఇచ్చినా హామీని పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భగత్ రెడ్డి, గోపాలకృష్ణ, ప్రదీప్ కుమార్, నాగరాజు, వీరేశ్ గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.