
- కేంద్ర మంత్రి బండి సంజయ్ని కోరిన బీజేపీ నేతలు
కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పట్టణంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని, బాగు చేయించాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ను స్థానిక బీజేపీ నేతలు కోరారు. బీజేపీ సీనియర్ కార్యకర్త మహేందర్ తల్లి ఇటీవల చనిపోవడంతో మంత్రి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం మాజీ మేయర్ సునీల్రావుతో కలిసి కారులో కరీంనగర్ తిరిగి వస్తుండగా బీజేపీ సీనియర్ నేత వాసాల రమేశ్, కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, మాజీ కార్పొరేటర్ బండ రమణారెడ్డి ఎదురై కొత్తపల్లిలో రోడ్ల దుస్థితిని పరిశీలించాలని కోరారు.
దీంతో వారితో కలిసి బండి సంజయ్ గుంతలు పడి వర్షం నీటితో నిండిన రోడ్లను పరిశీలించారు. రోడ్లపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు తిరగలేని పరిస్థితి నెలకొందని నేతలు వివరించగా కలెక్టర్తో మాట్లాడి రోడ్లు బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు కరీంనగర్ రూరల్ మండలం చర్లబూత్కూర్లో బీజేపీ సీనియర్ కార్యకర్త రమణారెడ్డి తల్లి ఇటీవల మరణించగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.