బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేత విజయశాంతి. రాష్ట్రంలో అత్యధిక ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకుంటున్నారన్నారు. ఈ దొరహంకార దుర్మార్గ పరిపాలన అంతం కావాలన్నారు. దశాబ్ధాల తెలంగాణా ఉద్యమకారిణిగా తాను ఎన్నడూ తన ప్రజల మేలు కోరుతూ వారికి అండగా ఉంటానన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ గద్దె దించగలదనే విశ్వాసంతోనే తాము బీజేపీ లో చేరామన్నారు. అందుకు తాము సాధ్యమైనంత వరకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గత కొన్ని రోజులుగా సమావేశమవుతున్న బీజేపీ నేతలంతా పార్టీకి ఇదే విషయం చెప్పామన్నారు. నిజా నిజాలు తెలుసుకోగలిగిన విజ్ఞత తెలంగాణ బిడ్డలకు ఎప్పుడు ఉంటదన్నారు.
తెలంగాణ సమాజంల అత్యధిక ప్రజల ధోరణి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలి ఈ దొరహంకార దుర్మార్గ పరిపాలన అంతం కావాలని కోరుకుంటున్నరు... అన్నట్లు అభిప్రాయం వినబడుతున్నది. ఈ నిజమైన ప్రజా భావాలను దశాబ్ధాల తెలంగాణా ఉద్యమకారిణిగా నేను ఎన్నడూ నా ప్రజల మేలు కోరుతూ, సమర్ధించి తీరుతాను.… pic.twitter.com/FgMORFXLyF
— VIJAYASHANTHI (@vijayashanthi_m) September 28, 2023