క్రీడలకు సమయం కేటాయించాలి : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్

క్రీడలకు సమయం కేటాయించాలి :  మంచిర్యాల కలెక్టర్  కుమార్  దీపక్
  •     మంచిర్యాల కలెక్టర్  కుమార్  దీపక్

నస్పూర్, వెలుగు:  వైద్య వృత్తి సవాళ్లతో కూడుకుందని, ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలకు కొంత సమయం కేటాయించాలని మంచిర్యాల కలెక్టర్  కుమార్ దీపక్  తెలిపారు. బుధవారం హాజీపూర్ లోని మెడికల్​ కాలేజీలో డీవైఎస్​వో హనుమంత్​రెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్​ సులేమాన్ తో కలిసి మెడికోలకు క్రీడా సామాగ్రి అందించారు. అనంతరం మాతృత్వ దినోత్సవం సందర్భంగా మాత శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్​ పాల్గొన్నారు. డీఎంహెచ్​వో అనిత, మేయర్  దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్  సల్లా రమ్య, తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలను నియంత్రించాలి

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్  కుమార్  దీపక్  తెలిపారు. కలెక్టరేట్ లో డీసీపీ ఎ.భాస్కర్, అడిషనల్  కలెక్టర్​ శ్రీనివాసరావు, డీఏవో సురేఖ, మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఎసీపీలు ప్రకాశ్, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లుతో కలిసి నకిలీ పత్తి విత్తనాల నియంత్రణపై రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ పత్తి విత్తనాలను సప్లై చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.