బీజేపీ అంటే చంపేస్తా
పోలీస్ కేసులు పెట్టి తొక్కిస్తా
యువకుడిపై టీఆర్ఎస్ నాయకుడి బూతు పురాణం
బెదిరించి దాడి చేసిన లోకల్ లీడర్
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
కేసు నమోదు చేయని పోలీసులు
చెన్నూర్, వెలుగు : మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు బీజేపీలో చేరుతున్నాడనే కోపంతో ఇంటికి పిలిపించి బూతులు తిడుతూ దాడి చేశాడో టీఆర్ఎస్ లీడర్. దీనిపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చినా కేసు నమోదు చేయలేదు. జిల్లాలోని కోటపల్లి మండలం దేవులవాడకు చెందిన నిట్టూరి బాపు రెండు రోజుల కింద పుష్కరాలకు వచ్చిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామిని కలిశాడు. తనతో పాటు మరో పది మంది యువకులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. దీంతో ఆయన త్వరలోనే చేరికల కార్యక్రమం పెట్టుకుందామన్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన టీఆర్ఎస్ లీడర్ బెల్లంకొండ సత్యనారాయణ...నిట్టూరి బాపుకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన బాపును కులం పేరుతో దూషించడమే కాకుండా చెంప, వీపుపై కొట్టాడు. ‘ మరోసారి బీజేపీ..గీజేపీ అంటూ తిరిగితే పోలీస్ కేసులు పెట్టించి లోపలేసి తొక్కిస్తా. రాజకీయాలు చేస్తే చంపిపారేస్తా’ అని వార్నింగ్ఇచ్చి పంపించాడు. దీంతో బాపు తనకు ప్రాణభయం ఉందంటూ కోటపల్లి పోలీస్స్టేషన్లో కేసు పెట్టాడు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు.
మరిన్ని వార్తల కోసం..