10 నుంచి బీజేపీ సమావేశాలు

10 నుంచి బీజేపీ సమావేశాలు

ప్రధానిగా నరేంద్ర మోడీ ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్నందున బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10 నుంచి 15 వరకు హాల్ మీటింగ్స్, సభలు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ నెల 10 న కూకట్​పల్లిలో జరగనున్న సభలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాల్గొంటారు. ఇదే సమయంలో అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించనున్నారు. వీటికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నేతలు హాజరవుతారు. దేశాభివృద్ధికి మోడీ తీసుకున్న నిర్ణయాలు, పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించనున్నారు.