మా ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలె.. పాల్వాయి హరీశ్​ 

మా ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలె.. పాల్వాయి హరీశ్​ 
  • ఉత్తర తెలంగాణపై వివక్ష ఎందుకు
  • తుమ్మిడిహెట్టికి కేంద్రం సహకరిస్తది


హైదరాబాద్​: సిర్పూర్  కాగజ్​నగర్​  నియోజకవర్గాన్ని మహారాష్ట్రలో కలపాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్  అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ సిర్పూర్ ప్రాంతంపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తమ ప్రాంతానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు లేవని ఆవేదన చెందారు. తమకు జీవన ప్రమాణాలు పెంచి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ నియోజకవర్గాన్ని మహారాష్ట్రలో కలపాలని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర తెలంగాణ ప్రజల నోటికాడి ముద్దను లాక్కెళ్లారని మండిపడ్డారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ద ఉత్తర తెలంగాణ మీద కూడా చూపాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ మీద వివక్షే.. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మీద వివక్ష చూపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ : రైతు రుణమాఫీతో నా జన్మ ధన్యమైంది: సీఎం రేవంత్ రెడ్డి

ప్రాంతాల అభివృద్ధి కోసం హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టవచ్చన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పారు. అవసరమైతే బీజేపీ ఎమ్మెల్యేలు అందరం కలిసి వెళ్లి కేంద్రాన్ని ఒప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు