మోడీ నేతృత్వంలోనే భారత్ అభివృద్ధి

మోడీ నేతృత్వంలోనే భారత్ అభివృద్ధి

అన్ని రాష్ట్రాలు అభివృద్ది చెందుతనే దేశం సమగ్రంగా అభివృద్ది చెందుతుందని ప్రధాని మోడీ కోరుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ విష ప్రచారం చేస్తుందని కొందరు ఆరోపిస్తున్నారని.. కానీ కేంద్ర ప్రభుత్వ నినాదమే సబ్ కా వికాస్, సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్ అని అన్నారు. మీరు చెప్పిన మత ఘర్షణలు భైంసాలో ఎందుకు జరిగాయో ఒక్కసారి అలోచించుకోవాలన్నారు. తాము సర్వమత సౌభ్రాతుత్వం కోసం పని చేస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటినుండి ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా కూడా మత ఘర్షణలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

భారత దేశం ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలో ఎంతో అభివృద్దిని సాధించిందని రఘునందన్ వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం అప్పుల వైపు వెళ్లుతోందన్నారు. మోడీ పాలనలో ప్రపంచ ఆర్థిక దేశాల్లో మన దేశం 5వ ఆర్థిక దేశంగా ఎదిగిందని తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర పథకాల ద్వారా ఎన్నో నిధులు వస్తున్నాయన్నారు. నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రానికి 450 కోట్లు కేంద్రం విడుదల చేసిందని అన్నారు.