
కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల ఈ అంశంపై స్పందించిన కేటీఆర్ కవితకు పరోక్షంగా చురకలంటించారు. బుధవారం ( మే 29 ) మీడియాతో ముచ్చటించిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నం నిజమేనని అన్నారు కవిత. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కవిత వ్యాఖ్యలపై స్పందించారు కవిత మాట్లాడింది నిజమేనని అనుకుంటున్నాని అన్నారు రాజా సింగ్. పెద్ద ప్యాకేజీ దొరుకుతే మావాళ్లు కూడా బీఆర్ఎస్ తోని కలిసిపోతారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఏ బిజెపి కాండేట్ ఎక్కడి నుంచి నిలబడాలి అది బీఆర్ఎస్ డిసైడ్ చేస్తుందని.. మావాళ్లు కాదని అన్నారు. గతంలో ఇదే జరిగిందని.. అందుకే బిజెపి నష్టపోయిందని అన్నారు. ఎప్పుడో బిజెపి గవర్నమెంట్ రావాలి ఇప్పటివరకు ఎందుకు బిజెపి గవర్నమెంట్ రాలేదు ఒకసారి ఆలోచన చేయాలని అన్నారు రాజాసింగ్. ప్రతి ఎన్నికల్లో మావాళ్లు కుమ్మక్కైపోయారని.. అందువల్ల బీజేపీకి చాలా లాస్ జరిగిందని అన్నారు.
కవిత వ్యాఖ్యలపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు... గతంలో మేము ఫాంహౌస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నమాటలే ఇప్పుడు మై డియర్ డాడి అంటూ కవిత లేఖ రాసిందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ లో చేరుతారన్న అంశంపై అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. నో కామెంట్స్ అంటూ సమాధానం ఇచ్చారు.
కాగా.. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్లాన్ జరిగిందని, తాను వద్దని వాదించానని కవిత సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్కు కాళేశ్వరం విషయంలో నోటీసులు వస్తే పార్టీలో చర్చ జరగలేదని, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేయలేదని కవిత చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ కేవలం ట్వీట్స్ కే పరిమితం అయిందని ఆమె ఎద్దేవా చేశారు. తాను రాసిన లేఖ గురించి మాట్లాడుతూ.. తన డాడీకి మాత్రమే లేఖ రాశానని, పార్టీ అధ్యక్షుడికి కాదని కవిత చెప్పడం కొసమెరుపు. తన డాడీకి తాను 100 లేఖలు రాసుకుంటానని, మీకొచ్చిన నష్టం ఏంటని కవిత నిలదీశారు. పార్టీలో చాలా విషయాలు చర్చిస్తానని ఆమె కుండబద్ధలు కొట్టారు. కేసీఆర్కు నోటీస్ వస్తే పార్టీ ఏం చేసిందని ఆమె ప్రశ్నించారు.