కేసీఆర్, కేటీఆర్.. ఆ విషయంలో మేధావులు

కేసీఆర్, కేటీఆర్.. ఆ విషయంలో మేధావులు

శ్రీశైలం: కేసీఆర్, కేటీఆర్.. తండ్రీకొడుకులిద్దరూ అబద్ధాలు చెప్పడంలో మేధావులని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆయన ఈ రోజు ఉదయం శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఆయన.. వేద పండితులు ఇచ్చిన తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘హుజురాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్‎కు ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో నవంబర్ 2న తేలిపోతుంది. తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతున్నట్టు నిన్న నేను శ్రీశైలం బయలుదేరిన తర్వాత తెలిసింది. మల్లన్న బీజేపీలో చేరడం పార్టీకి మరింత బలోపేతం. మల్లన్నకు స్వాగతం పలుకుతున్నాను. రేవంత్ రెడ్డి ఒక ఆశాజీవి. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు. కాంగ్రెస్ పార్టీ జాతిని విచ్ఛిన్నం చేసే వ్యక్తులను కూడా పార్టీలో చేర్చుకుంటుంది. కేంద్రం నుంచి ఎన్ని లక్షల కోట్ల నిధులు వచ్చాయో చెప్తున్నాం.. లేఖలు కూడా విడుదల చేస్తున్నాం. కేసీఆర్, కేటీఆర్.. తండ్రీకొడుకులిద్దరూ అబద్ధాలు చెప్పడంలో మేధావులు. శ్రీశైలానికి రైలు మార్గం ఏర్పాటు కోసం నా వంతు కృషి చేస్తాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలు మరియు నాయకులపై తప్పుడు కేసులు పెడితే తప్పకుండా పోరాటం చేస్తాం’ అని అర్వింద్ అన్నారు.

For More News..

మోడీ పథకాలను ఒక పాఠంలాగా ప్రజలకు చెప్పాలి

ఏకగ్రీవ పంచాయతీలకు ఫండ్స్ ఇస్తమని మేం చెప్పలేదు

వారికి నచ్చిన గ్రామాలకే నిధులిస్తున్నారు