ప్రభుత్వ ప్రోద్భలంతోనే లాయర్ దంపతుల హత్యలు

ప్రభుత్వ ప్రోద్భలంతోనే లాయర్ దంపతుల హత్యలు

పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన హైకోర్టు లాయర్లు గట్టు వామన్ రావు దంపతుల హత్యపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. వామన్ రావు కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు బండి సంజయ్, వివేక్ వెంకట స్వామిలు పెద్దపల్లి జిల్లాకు వెళ్లారు. జిల్లా ఆస్పత్రిలో ఉన్న వామన్ రావు దంపతుల పార్థివదేహాలను సందర్శించి, బాధిత కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. ఇది ప్రభుత్వం చేసిన హత్యే అని ఆయన అన్నారు. వామనరావు హత్య వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని సంజయ్ అన్నారు. న్యాయపోరాటం చేస్తున్న దంపతులను హత్య చేయటం దారుణమని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. గూండాయిజంలో తెలంగాణ నెంబర్ వన్‌గా మారిందని ఆయన మండిపడ్డారు.

‘న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్యోదంతం నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వామన్ రావు దంపతుల పార్థివదేహాలను సందర్శించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఈ హత్యలు జరిగాయి. ఈ ఘటనపై సీఎం స్పందించాల్సిందే. దీనిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేవరకు బాధిత కుటుంబం, న్యాయవాదుల పక్షాన పోరాడుతాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

For More News..

టెలికంకు రూ.12 వేల కోట్లు ప్రకటించిన కేంద్రం

పచ్చి మిర్చితో గరం గరం మిర్చి చాయ్

ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్

మిస్డ్ కాల్‌‌ ఇస్తే లోన్ ఇస్తరట