కరీంనగర్ జిల్లాలోని పుణ్యక్షేత్రాలను సందర్శించనున్న సంజయ్

కరీంనగర్ జిల్లాలోని పుణ్యక్షేత్రాలను సందర్శించనున్న సంజయ్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఎంపీ బండి సంజయ్ శ‌నివారం (అక్టోబర్ 10, 2020) సందర్శించనున్నారు. శ‌నివారం ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 9:00 గంటలకు శంషాబాద్ చేరుకొని, అటు నుంచి నేరుగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలకు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఆ త‌ర్వాత‌ సాయంత్రం 5 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ క్షేత్రం చేరుకొని, రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మరుసటి రోజు (ఆదివారం) కరీంనగర్ లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు