హోం మంత్రికి లా అండ్ ఆర్డర్ అంటే కూడా తెలియదు

హోం మంత్రికి లా అండ్ ఆర్డర్ అంటే కూడా తెలియదు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని బఫూన్లు పాలిస్తున్నారని విమ‌ర్శించారు బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకోవటానికి తెలంగాణను 4లక్షల కోట్లు అప్పుల్లో నెట్టిందని మండిప‌డ్డారు. ఇక‌ హోంమంత్రి మహమూద్ అలీకి లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో కూడా తెలియదని అన్నారు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, పోలీస్ అధికారులు రోహింగ్యాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రోహింగ్యాలు దేశ భద్రతకే సవాల్ గా మారారని, ఐరిస్, బయోమెట్రిక్ లేకుండానే వారు ఆధార్ కార్డులను సంపాదిస్తున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో బోగస్ అడ్రసులతో రోహింగ్యాల‌కు అధికారులు పాస్ పోర్టులు జారీ చేస్తున్నారని , రోహింగ్యాలపై ట్విట్టర్ పిట్ట కేటీఆర్ ఎందుకు కూయటం లేదు? అని ప్ర‌శ్నించారు.

కేసీఆర్, కేటీఆర్ లు తోలు తీస్తామంటోన్నా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పౌరుషం రావటం లేదని, త్వ‌ర‌లోనే కేసీఆర్ కుటుంబం తోలు తీయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు అర్వింద్ . సీఎం జన్మదినం సందర్భంగా మొక్కలు పేరుతో 500కోట్లు దోచుకున్నార‌ని , ఆ ఖర్చును NRI సెల్ కోసం ఖర్చు చేయాల్సిందని అన్నారు.