ప్రధాని మోడీతో ఎంపీ అర్వింద్ భేటీ..రాష్ట్ర రాజకీయాలపై చర్చ

ప్రధాని మోడీతో ఎంపీ అర్వింద్ భేటీ..రాష్ట్ర రాజకీయాలపై చర్చ

తనపై జరిగిన దాడిని ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇవాళ ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఎంపీ అర్వింద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై ప్రధానితో చర్చించామని ఆయన చెప్పారు. 

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచించారని అర్వింద్ వెల్లడించారు. ప్రధాని మోడీతో 12 నిమిషాలు భేటీ అయ్యానని..రాష్ట్రంలోని పాలన గురించి మోడీ అడిగి తెలుసుకున్నారని అర్వింద్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అధిష్టానం సిద్ధంగా ఉందని..వ్యూహాలకు తగ్గట్టుగా ముందుకు వెళ్తోందన్నారు.