లోక్ సభ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు చేసిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన బీజేపీ ఎంపీసాధ్వి ప్రగ్యా తనకు కొవిడ్ పాజిటివ్ అని స్వయంగా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా, కాంటాక్ట్ లో ఉన్న వారు వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఆరంభం కావడానికి కొద్ది గంటల ముందే ఆమె అనౌన్స్ మెంట్ చేశారు.
ఇవాల్టి నా కరోనా రిపోర్ట్ లో పాజిటివ్ అని వచ్చింది అని తెలిపారు సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాను.. నాతో రెండ్రోజులుగా కాంటాక్ట్ లో ఉన్న వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అలర్ట్ గా ఉండాలని అవసరమైతే కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నా. మీ క్షేమాన్ని కోరుకుంటూ.. అని ట్వీట్ లో తెలిపారు.
आज मेरी कोरोना रिपोर्ट पॉजिटिव आई है। मैं चिकित्सकों की देखरेख में हूं। 2 दिनों में जो भी मेरे संपर्क में आए हैं सभी से आग्रह है कि सचेत रहें और आवश्यकता पड़ने पर कोरोना टेस्ट भी करवा लें। हमें आपकी चिंता है। प्रभु से प्रार्थना है आप सभी स्वस्थ रहें।
— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) January 30, 2022
మరిన్ని వార్తల కోసం...