
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై స్పందించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ ను వద్దనుకుందని.. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ సమాజానికి చెల్లని రూపాయిగా మారిందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు తప్పుడు కేసులు పెట్టించారని.. డ్రోన్లు ఎగరేశారని అరెస్టులు చేయించారని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని.. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేయిస్తోందని కవితే చెప్తున్నారని అన్నారు రఘునందన్. పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో ప్రభుత్వం గుర్తించి కేసులు పెట్టాలని అన్నారు.
అమరుడు శ్రీకాంతాచారికి కేసీఆర్ ప్రభుత్వం చేసిందని.. ఎంతోమంది తెలంగాణ అమరులకు బీఆర్ఎస్ ఏం చేసిందని అన్నారు రఘునందన్. చెల్లని రూపాయిగా మారిన కేసీఆర్ ఫ్యామిలీ మళ్ళీ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటోందని అన్నారు. ఏం కాలేదు కాబట్టే ఎదో ఉన్నట్లు హడావిడి చేస్తున్నారని అన్నారు. తమ ఫ్యామిలీ తప్ప వేరేవాళ్లు ఉండొద్దని కేసీఆర్ ఫ్యామిలీ భావిస్తోందని అన్నారు రఘునందన్.
ఏ అమరుడి కుటుంబాన్ని కవిత పరామర్శించలేదని... పదేళ్లు అధికారంలో ఉండి ఎంత ఫ్యామిలీలను ఆడుకున్నారని అన్నారు. బీజేపీ బలం పుంజుకుంటుందని.. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవలేదని అన్నారు.చెల్లె కవితమ్మ చెప్పినట్లు తనపై పెయిడ్ ఆర్టికల్స్ రాపిస్తున్నారని అన్నారు రఘునందన్. చచ్చిన పార్టీకి ప్రాణం పోసేందుకు కేటీఆర్, కవిత బ్రాండింగ్ చేసుకుంటున్నారని అన్నారు.బతుకమ్మ చరిత్రలో ఉందని.. కవిత బతుకమ్మ ఆడితే వచ్చినట్లు చెప్పుకుంటున్నారని అన్నారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు చర్చలు జరిగాయనీ ఒక్కసారీ.. కేసీఆరే మా నాయకుడని కవిత రెండు స్టేట్ మెంట్లు ఇచ్చారని.. బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఈ చెత్త పంచాయతీలని అన్నారు. బీజేపీ ప్రజలు మనస్సు గెలిచింది.. పైసలు పంచి గెలవలేదని అన్నారు.బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు చర్చలు జరగలేదని.. కవిత చిట్ చాట్ లు చేసుడు ఎందుకు.. ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టాలని అన్నారు.
కుటుంబ పంచాయతీని మీరు మీరు తేల్చుకోవాలి తప్పితే బీజేపీని వివాదాల్లోకి లాగొద్దని అన్నారు రఘునందన్. హరీష్ రావు బీజేపీ కోవర్టు అయితే మంత్రి వర్గం నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ మంత్రిగా నా కుమార్తె ఆసుపత్రిని ప్రారంభించారని.. హరీష్ రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్ కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని అన్నారు. జనం గుండెల్లో బీఆర్ఎస్ కు స్థానం లేదని.. జాగ కోసం కోట్లాడుతున్నారని అన్నారు.
బీఆర్ఎస్ బలహీనపడాలి అనుకునేవాల్లే కవిత వెనక ఉన్నారని.. కవిత పార్టీ పెడుతుందని తనకు సమాచారం ఉందని అన్నారు.బీఆర్ఎస్ కు అభ్యర్ధులు లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదని.. కోవర్టు పని చేసే వాళ్లు బీజేపీలో ఉండరని అన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న పంచాయతే.. ఇక్కడ వచ్చిందని అన్నారు రఘునందన్.