బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశం

బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో  జేపీ నడ్డా సమావేశం

బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలుపై చేసే అంశంపై చర్చించారు. దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధానంగా తెలంగాణపై ఫోకస్ పెంచాలని నిర్ణయించారు. నేతలందరూ ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని నడ్డా సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలతోపాటు ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు.

కాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు బహిరంగ సభ సక్సెస్ కావడంతో రాష్ట్ర నేతలను నడ్డా అభినందించారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని సూచించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా నాలుగు రోజుల పాటు హైదరాబాద్ లోనే మఖాం వేశారు నడ్డా.