ఈటలను సస్పెండ్ చేయడంపై డీకే అరుణ ఫైర్

ఈటలను సస్పెండ్ చేయడంపై డీకే అరుణ ఫైర్
  • బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

హైదరాబాద్: అసెంబ్లీలో పరిణమాలపై మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అకారణంగా శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

అసెంబ్లీ ఏమైనా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా? అని ఆమె నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యేలు అంటే అంత భయం ఎందుకు? ఎమ్మెల్యే ఈటలను ఏ కారణంతో సస్పెండ్ చేసి పోలీస్ వాహనంలో తరలించారు? అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.