తెలంగాణలోని ప్రైవేట్ వర్సిటీల్లో..రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలి : బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ 

తెలంగాణలోని ప్రైవేట్ వర్సిటీల్లో..రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలి : బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని 10 ప్రైవేట్ యూనివర్సిటీలు, 5 డీమ్డ్ వర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 15(5), 46 రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం.. వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌‌ చేశారు.

ఈ అంశంపై గతేడాది ఆగస్టులో నేషనల్ ఎస్టీ కమిషన్‌‌కు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎస్టీ కమిషన్ తమ ముందు హాజరుకావాలని కోరిందని తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం తనతో పాటు యూజీసీ సెక్రటరీ, డీన్‌‌లు హాజరైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల పట్ల వర్సిటీల తీరుపై ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణలోని ప్రైవేట్ వర్సిటీలకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించాలని యూజీసీ సెక్రటరీ, డీన్‌‌లకు కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.