భారత్లో భారత్ బజార్ ఉంటదా? : బండి సంజయ్

భారత్లో భారత్ బజార్ ఉంటదా? : బండి సంజయ్

భారత్లో భారత్ బజార్ ఉంటదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఏపీ నేతలు బీఆర్ఎస్ చేరిక సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. భారత్లో చైనా బజార్లు తప్ప భారత్ బజార్లు కన్పించలేదని కేసీఆర్ అన్నారని.. అలా అయితే తెలంగాణలో తెలంగాణ బజార్ ఉందా అని అడిగారు. మిగితా దేశాల్లో భారత్ బజార్లు ఉంటాయని.. స్వదేశంలో ఎందుకుంటాయని నిలదీశారు. మైసూర్ పాక్ అంటే మైసూర్లో తయారు చేస్తారా.. ఇరానీ చాయ్ ఇరాన్లో తయాచేస్తారా అన్నారు. 

కరోనా సమయంలో మిగితా దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత భారత్ది అని సంజయ్ చెప్పారు. ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. ఇవన్నీ కేసీఆర్ జిమ్మిక్కులని విమర్శించారు. కేసీఆర్ పెద్ద ఫిట్టింగ్ మాస్టర్ అని.. కేసీఆర్ అంత చీటింగ్ తెలివి ఎవరికి ఉండదన్నారు. టీఆర్ఎస్ పేరు మార్పుతో తెలంగాణతో ఉన్న బంధం తెగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.