కుటుంబపాలన అంతానికి విజయశాంతి కృషి : బండి సంజయ్

కుటుంబపాలన అంతానికి విజయశాంతి కృషి : బండి సంజయ్

రాష్ట్రంలో కుటుంబపాలన అంతం కోసం విజయశాంతి పోరాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.  తెలంగాణ ఉద్యమంలో ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమని చెప్పారు. విజయశాంతి 25ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై రచించిన మన రాములమ్మ రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు.  పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడింది విజయశాంతి మాత్రమే అని వ్యాఖ్యానించారు. బీజేపీలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉందని.. కుటుంబ పార్టీలో ఉండదని విమర్శించారు. ఎంతోమంది కార్యకర్తల త్యాగాలతో బీజేపీ నిర్మాణమైందన్నారు. సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని.. పార్టీని వదిలివెళ్లిన నాయకులు తిరిగిరావాలని పిలుపునిచ్చారు. ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో వాటిని సాధించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.