ఇంజినీరింగ్ ​సీట్లు అమ్ముకుంటున్నరు : దళిత మోర్చా నాయకులు

ఇంజినీరింగ్ ​సీట్లు అమ్ముకుంటున్నరు : దళిత మోర్చా నాయకులు
  • నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్​కాలేజీల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదని బీజేపీ గిరిజన, దళిత మోర్చా నాయకులు ఆరోపించారు. బి కేటగిరీ మేనేజ్​మెంట్, సి కేటగిరీ ఎన్​ఆర్ఐ కోటా సీట్లను రూ.లక్షలకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి చైర్మన్ కార్యాలయానికి వెళ్లి, చైర్మన్​బాలకృష్ణారెడ్డికి  వినతి పత్రం అందజేశారు.

 గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్ నాయక్, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రైవేట్​ఇంజినీరింగ్ కళాశాలలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి, కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. జీవో 13 ప్రకారం మెరిట్ విద్యార్థులకు సీట్లు కేటాయించాలని కోరారు.  పేద విద్యార్థులకు అన్యాయం చేస్తే రానున్న రోజుల్లో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.