జనం బీఆర్ఎస్ పాలన వద్దనుకుంటున్నరు : విజయశాంతి

జనం బీఆర్ఎస్ పాలన వద్దనుకుంటున్నరు : విజయశాంతి

హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో అత్యధిక మంది ప్రజలు బీఆర్ఎస్ సర్కారును వదిలించుకోవాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. దొరహంకార దుర్మార్గ పాలన అంతం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ ప్రజాభావాలను దశాబ్దాల తెలంగాణ ఉద్యమకారిణిగా సమర్థిస్తున్నట్టు చెప్పారు. గతకొన్ని రోజులుగా సమావేశమవుతున్న బీజేపీ నేతలందరం

బీఆర్ఎస్ సర్కారును బీజేపీ మాత్రమే తొలగించగలదన్న విశ్వాసంతోనే ఆ పార్టీలో చేరామని స్పష్టం చేశారు. దానికోసం సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని, పార్టీకి అదే విషయం చెప్పామని ఆమె పేర్కొన్నారు. నిజానిజాలు తెలుసుకోగలిగిన విజ్ఞత తెలంగాణ బిడ్డలకు ఎప్పుడూ ఉంటుందని ఆమె చెప్పారు.