TRS అవినీతిపై కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తాం

TRS అవినీతిపై కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తాం

TRS ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడుతోందన్నారు తెలంగాణ బీజేపీ ఇన్చార్జి తరుణ్ చుగ్. ప్రభుత్వ అవినీతిపై కేంద్ర హోంశాఖకు నివేదిక అందిస్తామని… సీబీఐ విచారణ జరిపించాలని కోరతామన్నారు. అవినీతిపరులకు శిక్ష పడేంత వరకు పోరాడతామన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో పర్యటన సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగుతోందని…ఆ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిస్తామని చెప్పారు.

సింగరేణి సంస్థను కూడా అవినీతిమయం చేశారన్నారు తరుణ్ చుగ్. ఆ సంస్థలోని TBGKS యూనియన్ ను TRS ఎమ్మెల్సీ కవిత తన గుప్పెట్లో ఉంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా టీఆర్ఎస్ కనుసన్నల్లో పని చేస్తున్నారని విమర్శించారు. కవిత తన పద్ధతిని మార్చుకోవాలని సూచించారు.