మాజీ క్రికెటర్ కు ఐసిస్ బెదిరింపులు 

మాజీ క్రికెటర్ కు ఐసిస్ బెదిరింపులు 

న్యూఢిల్లీ: ఐసిస్ టెర్రర్ గ్రూప్ నుంచి తనకు బెదిరింపులు వచ్చాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ పోలీసులను ఆశ్రయించాడు. తనతోపాటు తన ఫ్యామిలీని చంపేస్తామంటూ ఐసిస్ ఉగ్రసంస్థ ఈమెయిల్స్ పంపిందని ఢిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో గంభీర్ పేర్కొన్నాడు. ఈ కంప్లయింట్ పై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి శ్వేతా చౌహాన్ తెలిపారు. గంభీర్ ఇంటి పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. కాగా, గంభీర్ కు ఇటువంటి బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. తనను, తన కుటుంబీకులను చంపేస్తామని హెచ్చరిస్తున్నారంటూ 2019లో ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు ఈ టీమిండియా మాజీ ఓపెనర్.