హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన టీజీ 20 లీగ్లో ఈ -చాంపియన్స్ – మెదక్ ఫాల్కన్స్ మ్యాచ్ సందర్భంగా బ్లాక్ టికెట్ల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. మ్యాచ్కు భారీగా ప్రేక్షకులు తరలివస్తారని ముందే అంచనా వేసిన దళారులు, తక్కువ ధర టికెట్లను ముందుగానే బ్లాక్ చేసినట్లు సమాచారం.
డిస్ట్రిక్ట్ యాప్లో రూ.49 టికెట్లు మ్యాచ్కు ముందుగానే సోల్డ్ అవుట్గా చూపించారని, స్టేడియం టికెట్ కౌంటర్ల వద్ద కూడా టికెట్లు అందుబాటులో ఉంచలేదని అభిమానులు వాపోయారు. స్టేడియం పరిసరాల్లో ఒక్కో టికెట్ రూ.150 నుంచి రూ.200 ఎక్కువకు అమ్ముతున్నట్లు ఆరోపించారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
