హైదరాబాద్: CMC ఫుడ్ సేఫ్టీ అధికారులు కూకట్పల్లిలోని KS బేకర్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు, పరిశుభ్రత లోపాలు బయటపడ్డాయి. ఫ్రీజర్లో వెజ్, నాన్-వెజ్ ఆహార పదార్థాలను ఒకేచోట నిల్వ చేయడం, వంటగదిలో బొద్దింకల బెడద, తుప్పుపట్టిన ఓవెన్లు, అపరిశుభ్రమైన టైల్స్ను అధికారులు గుర్తించారు.
ఈ పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు యాజమాన్యానికి నోటీసు జారీ చేశారు. నిర్దేశించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని, ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.
