నాంపల్లిలో ఇంటర్మీడియట్ విద్యామండలి సమావేశం

నాంపల్లిలో ఇంటర్మీడియట్ విద్యామండలి సమావేశం

నాంపల్లిలోని రూసా బిల్డింగ్‭లో ఇంటర్మీడియట్ విద్యా మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్ బోర్డు ఇన్ ఛార్జి సెక్రటరీ నవీన్ మిట్టల్ హాజరయ్యారు. అనుబంధ గుర్తింపు పొందని కాలేజీల అంశంపై కీలక చర్చలు జరుపుతున్నారు. ఆ కాలేజీలకు ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు.. అందులోని విద్యార్థులకు ప్రైవేటుగా పరీక్ష రాసే ప్రతిపాదనలపైనా చర్చలు జరుపుతున్నారు.

ప్రయోగాత్మకంగా ఇంటర్‌లో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఆన్‌లైన్‌ విధానంలో జరపాలన్న ప్రతిపాదనపై మంత్రి సబితా చర్చిస్తున్నారు. ఇంటర్ విద్యలో పలు మార్పులు చేసేలా అనేక అంశాలపై విద్యామండలి సమావేశంలో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే.. విద్యార్థులు గందరగోళంలో పడకుండా నిర్ణయాలు తీసుకోవాలని విద్యామండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు.