పోలీస్ బందోబస్తు మధ్య సునీల్ అంత్యక్రియలు

పోలీస్ బందోబస్తు మధ్య సునీల్ అంత్యక్రియలు

ఉద్యోగం రావడంలేదని మనస్థాపంతో సూసైడ్ చేసుకొని చనిపోయిన విద్యార్థి బోడ సునీల్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రాంసింగ్ తండాలో మొదలయ్యాయి. సమయం గడిచే కొద్దీ నాయకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించిన పోలీసులు.. సునీల్ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి అంతిమయాత్రను ప్రారంభించారు. అదేవిధంగా రాంసింగ్ తండాకు ఎవరూ రాకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసుల భద్రత మధ్య సునీల్ అంత్యక్రియలు పూర్తికానున్నాయి.