మల్లారెడ్డికి షాకిచ్చిన బోడుప్పల్ కార్పొరేటర్లు

మల్లారెడ్డికి షాకిచ్చిన బోడుప్పల్ కార్పొరేటర్లు

మేడిపల్లి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల వేళ మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డికి సొంత పార్టీకి చెందిన బోడుప్పల్ కార్పొరేటర్లు షాకిచ్చారు. గురువారం మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్​యాదవ్, బోడుప్పల్ అధ్యక్షుడు పోగుల నరసింహరెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన 23 డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేశ్​యాదవ్, 1 వ  డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్,13వ డివిజన్ కార్పొరేటర్ దానగళ్ల అనితా యాదగిరి,20 వ డివిజన్ కార్పొరేటర్ జడిగే మహేందర్ యాదవ్,24 వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేశ్​యాదవ్ ఉన్నారు. 

కాంగ్రెస్ నేతలు రాపోలు రాములు, కొత్త కిషోర్ గౌడ్, దానగళ్ల యాదగిరి, గుర్రాల వెంకటేశ్​ఉన్నారు. పార్టీ మారిన కార్పొరేటర్లు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే శత్రువులుగా చూస్తున్నారని మండిపడ్డారు. బోడుప్పల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో తాము ఆవేదన చెందినట్లు తెలిపారు