కేపీహెచ్బీ కాలనీలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం

కేపీహెచ్బీ కాలనీలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్బీ కాలనీలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానిక లోటస్ ​హాస్పిటల్​ సమీపంలోని అండర్​గ్రౌండ్ డ్రైనేజీకి తరచూ లీకేజీ సమస్య వస్తుండటంతో మంగళవారం పారిశుధ్య సిబ్బంది ప్రెషర్ ​పైపుతో క్లీన్ చేస్తుండగా.. నాలుగైదు రోజుల పాప మృతదేహం బయటపడింది. 

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశామని, శిశువు డెడ్​బాడీ డ్రైనేజీలోకి ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.