హర్యానాలోని జనవరి 2న హత్యకు గురైన మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహన్ని దాదాపు 11 రోజుల తర్వాత తోహానా అనే మురికి కాలువలో లభ్యమైంది. 27 ఏళ్ల దివ్య పహుజా హత్య మిస్టరీపై ఆరు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. గ్యాంగ్స్టర్ సందీప్ గర్ల్ఫ్రెండే దివ్య పహుజా. దివ్యను హత్య చేసిన కేసులో ఇప్పటికే ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. దివ్య మృతదేహన్ని తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా వాటి ఆధారంగానే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
మాజీ మోడల్ దివ్యను గురుగ్రామ్లో హోటల్ యజమాని అభిజీత్ సింగ్ కాల్చి చంపాడు. అతనితో పాటుగా మరో ఇద్దరు కలిసి మృతదేహాన్ని పంజాబ్లోని భాక్రా కెనాల్లో పడేశారు. ఆ మృతదేహం హర్యానాకు కొట్టుకువచ్చింది. అమృతదేహాన్ని పారవేసేందుకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎందుకు మోడల్ దివ్యను హత్య చేశారో ఇంకా తెలియలేదు.
ఇక గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ గర్ల్ఫ్రెండే ఈ దివ్య పహుజా. ముంబైలో జరిగిన వివాదాస్పద ఎన్కౌంటర్లో సందీప్ హత్యకు గురయ్యాడు. అయితే ఆ కేసులో మోడల్ దివ్య సుమారు ఆరేళ్ల పాటు జైలుశిక్షను అనుభవించింది. ఆమె గత ఏడాది జూన్లో జైలు నుంచి విడుదలైంది. అరెస్టు అయిన సమయంలో పహుజా వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే.