
ఖానాపూర్, వెలుగు: హైదరాబాద్ లోని గాంధీ భవన్లో మంగళవారం జరిగిన టీపీసీసీ పీఏసీ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం అందుకున్నారు.
ఈ సందర్భంగా బొజ్జు మాట్లాడుతూ.. తనపై నమ్మ కం ఉంచి మరోసారి ఈ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.