ప్రజలు ప్రతిపక్షాలను నమ్మట్లే: బొల్లం మల్లయ్య యాదవ్​

ప్రజలు ప్రతిపక్షాలను నమ్మట్లే:  బొల్లం మల్లయ్య యాదవ్​

కోదాడ, వెలుగు : రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూస్తున్నారు తప్ప ప్రతి పక్షాలను నమ్మడం లేదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి  చెందిన వివిధ పార్టీలకు చెందిన   పలువురు ఎమ్మెల్యే  సమక్షంలో  బీఆర్‌ఎస్‌ లో చేరారు. 

ALSO READ : కర్ణాటక బంద్‌తో బెంగళూరు ఎయిర్ పోర్ట్లో గందరగోళం.. 44 విమానాలు రద్దు..

అనంతరం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన వెంట కోదాడ ఎంఈవో సలీం షరీఫ్, పలువురు నాయకులు ఉన్నారు.