టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసులు

టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసులు

హైదరాబాద్ మాదాపుర్ పోలిస్ స్టేషన్ పరిధిలో టీసీఎస్ స్టాప్ వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. దీంతో కంపెనీ యాజమాన్య అప్రమత్తమై వెంటనే స్టాఫ్ ను ఖాళీ చేయించి..మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్వ్కాడ్ తో కంపెనీలో తనిఖీల చేయించారు.

పూర్తిగా వెతికి ఎలాంటి బాంబు లేదని గుర్తించారు. దీంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాంబు ఉందని ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు కనిపెట్టారు. నిందితుడు సేక్యురిటీ విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగిగా గుర్తించారు మాదాపుర్ పోలీసులు. ఆ వ్యక్తిని పట్టుకునే పనిలో పోలీసులు గాలిస్తున్నారు.