బోర్​వెల్​ లారీ బోల్తా.. వలస కూలీ మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

బోర్​వెల్​ లారీ బోల్తా.. వలస కూలీ మృతి..  ఐదుగురికి తీవ్ర గాయాలు

ఆసిఫాబాద్, వెలుగు :  ఆసిఫాబాద్​ జిల్లాలో బోర్ వెల్ లారీ బోల్తా పడి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెబ్బన ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం.. సోమవారం రాత్రి కాగజ్ నగర్ నుంచి ఆసిఫాబాద్ కు బయలుదేరిన బోర్​వెల్​లారీ.. ఓవర్​స్పీడ్​కారణంగా అదుపు తప్పి కైర్ గాం నేషనల్ హైవేపై బోల్తా పడింది.

లారీలోని కోల్​కతాకు చెందిన దోబంగ్(30) అనే కూలీ అక్కడికక్కడే చనిపోయాడు. డ్రైవర్ చిత్రు, ఇతర కూలీలు ఆనంద్, అరవింద్, సమీర్ లాల్, లాల్ చంద్రమాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసిఫాబాద్ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.