సాయం చేయాల్సింది పోయి.. పేదల నుంచే తీసుకుంటరా?

సాయం చేయాల్సింది పోయి.. పేదల నుంచే తీసుకుంటరా?
  • పెట్రోల్‌, డీజిల్‌ మీద ట్యాక్స్‌ పెంచడంపై
  •  కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కామెంట్‌

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు ప్రజలకు ప్రభుత్వం సాయం చేయాలని అలాంటిది ప్రభుత్వమే ప్రజల నుంచి వసూలు చేస్తోందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. లోటులో ఉంటే అప్పులు తీసుకోవాలని, ట్యాక్స్‌ల రూపంలో ప్రజలపై భారం వేయడం కరెక్ట్‌ కాదని ఆయన అన్నారు. పెట్రోల్‌, డీజీల్‌పై వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ పెంచడం, కేంద్రం కూడా ట్యాక్స్‌లు విధించడంపై చిదంబరం స్పందించారు. “ కొత్త, అధిక ట్యాక్స్‌లు వల్ల భవిష్యత్తులో చాలా కుటుంబాలు ఇబ్బందులు పడతాయి. లోటును తీర్చుకునేందుకు ప్రభుత్వాలు అప్పులు తీసుకోవాలి. కానీ జనంపై భారం మోపకూడదు. ఇబ్బందుల్లో ఉన్నాం సాయం చేయమని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటుంటే ప్రభుత్వం రివర్స్‌ ట్రాన్స్‌వర్‌‌ చేయించుకుంటుంది. ఇది దారుణం” అని చిదంబరం ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్న నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశంతో కేంద్రం పెట్రలో, డీజిల్‌పై ఎక్సైజ్‌ ట్యాక్స్‌ను భారీగా పెంచింది. లీటర్‌‌ పెట్రలోపై రూ.10, డీజిల్‌పై రూ.13 పెంచింది. అయితే రీటైల్‌ అమ్మకాలపై ఈ పన్ను భారం ఉండదు. మరోవైపు ఢిల్లీ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై ట్యాక్స్‌ను పెంచాయి.