పాడుబడిన బావిలో పడి బాలుడు మృతి

పాడుబడిన బావిలో పడి బాలుడు మృతి

నర్సాపూర్, వెలుగు : పాడుబడిన బావిలో పడి ఓ బాలుడు చనిపోయాడు. మెదక్ జిల్లా నర్సాపూర్  మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ గుర్జా తాండాలో ఈ ఘటన జరిగింది. గుర్జా తండాకు చెందిన అరుణ్  (8) సోమవారం ఇంటి ముందు బూట్లు వేసుకొని ఆడుకుంటున్నాడు. ఒక షూ బావిలో పడడంతో షూ కోసం బావిలోకి చూస్తూ అందులోకి పడిపోయాడు.

గమనించిన కుటుంబ సభ్యులు బావిలోకి దిగి పిల్లవాడిని బయటకు తీశారు. అప్పటికే అరుణ్​  చనిపోయాడు. బాలుడికి మతిస్థిమితం లేదని, మూడు సంవత్సరాల క్రితం అతని తల్లిదండ్రులు చనిపోయారని బాలుడి కుటుంబీకులు తెలిపారు. బాబాయ్ జయరాం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.