
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' (Kannappa).ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో మంచు మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, సప్తగిరి ఇతరలు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.
ఈ క్రమంలో వరుస పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతూ వస్తున్నారు మేకర్స్. అలాగే, అవే అప్డేట్స్తో వివాదంలో కూడా ఉంటున్నారు. లేటెస్ట్ కాంట్రవర్సీ విషయానికి వస్తే..
గతేడాది సెప్టెంబర్లో కన్నప్ప నుంచి 'పిలక గిలక' అనే హస్య పాత్రలను పరిచయం చేశారు. 'పిలక గిలక' పాత్రలను పోషిస్తున్న బ్రహ్మానందం, సప్తగిరిలకు సంబంధించిన పోస్టరు రిలీజ్ చేశారు. అలాగే ఈ పోస్టర్లో "చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట... నేర్పిన గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే..." అనే డైలాగ్ని కూడా రివీల్ చేశారు. ఇపుడీ ఈ పిలక గిలక పాత్రపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. తమ మనోభావాలను కించపరుస్తున్నారంటూ బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Introducing the power-house of talent, the King of Comedy #Brahmanandam as #Pilaka & joining him is the talented @MeSapthagiri as #Gilaka; they portray the gurus of wisdom, wit & skills to teach the forests in the world of #Kannappa🏹#HarHarMahadevॐ@themohanbabu… pic.twitter.com/AEBawyB3Da
— 24 Frames Factory (@24FramesFactory) September 30, 2024
‘బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ‘కన్నప్ప’ మూవీలో లేవని ఈ చిత్ర నిర్మాత, నటులు మోహన్ బాబు, విష్ణు స్పష్టం చేయాలని’బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో నేడు (జూన్ 7న) గుంటూరులో నిర్వహిస్తున్న కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై.. అటువంటి పాత్రలు లేవని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలని శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు. లేదంటే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటామని శ్రీధర్ హెచ్చరించారు. ఈ విషయంపై కన్నప్ప టీమ్ స్పందించాల్సి ఉంది.
ఇటీవలే ‘కన్నప్ప’కు సంబంధించిన కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ మిస్ అయ్యి.. పెద్ద సంచలనం రేపింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మరియు ఇంగ్లీష్ తదితర భాషలలో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు.