భారత్ నుంచి బ్రెజిల్‌కు రెండు కోట్ల టీకాలు

భారత్ నుంచి బ్రెజిల్‌కు రెండు కోట్ల టీకాలు

దేశీయ వ్యాక్సిన్ కంపెనీ భారత్ బయోటెక్ నుంచి రెండు కోట్ల కోవాక్సిన్ టీకాలను కొననున్నట్లు బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దానికి సంబంధించిన ఒప్పందంపై ఆ దేశ మంత్రిత్వ శాఖ గురువారం సంతకం చేసింది. ఈ వ్యాక్సిన్లను మార్చి నుంచి మే నెలల మధ్య డెలివరీ చేయనున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఈ ఒప్పందం విలువ సుమారుగా 3 లక్షల డాలర్లు ఉంటుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి 80 లక్షల డోసులు మార్చిలో డెలివరీ అవుతాయని అధికారులు తెలిపారు.

భారత్ నుంచి వ్యాక్సిన్ల కొనుగోలును వేగవంతం చేయడానికి గత వారం కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రెజిల్‌లో గురువారం కరోనాతో 1,541 మరణాలు సంభవించాయి. దాంతో ఆ దేశంలో కరోనా మరణాలు 251,498కు చేరుకున్నాయి.