10శాతం కూడా పూర్తికాని పనులు
లాక్డౌన్ సాకుగా చూపుతున్న అధికారులు
మ్యాన్హోల్స్, సివరేజీ లేన్ల ఆన్లైన్ మానిటరింగ్ కరువు
హైదరాబాద్, వెలుగు: సివరేజీ లేన్ల ఆన్ లైన్ మానిటరింగ్కు వాటర్బోర్డు చేపట్టిన జీఐఎస్(జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం) మ్యాపింగ్ పనులు ఏడాదైనా 10 శాతం కూడా కాలేదు. కోర్ సిటీలో మొదలైన వర్క్స్ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సిటీలో నిజాం కాలంలోనే 37 కిలోమీటర్ల మేర సివరేజీ లేన్ నిర్మించారు. ప్రస్తుతం ఉన్న 173 ట్రంక్ లేన్లు, 6,082 కిలో మీటర్ల డ్రైనేజీ లేన్ల నుంచి డైలీ1,700 ఎంఎల్డీల మురుగు వస్తోంది.
కొన్నిచోట్ల పాత లేన్లు ఉండటంతో మెయిన్ రోడ్లు, కాలనీల్లోని మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. వాటిని జీఐఎస్కు అటాచ్ చేసి యాప్ ద్వారా మానిటరింగ్ చేయాలని ఏడాది క్రితం వాటర్ బోర్డు నిర్ణయించింది. దాంతో ట్రంక్ లేన్ల పొడువు, ఏ టైమ్లో మురుగు ప్రవాహం ఎక్కువ ఉంది, ఓవర్ ఫ్లో అవుతున్న మ్యాన్ హోల్ ఎక్కడున్నాయి అనేది కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంది. అలా సమస్యను గుర్తించి, సాల్వ్ చేయాలని భావించింది. డివిజన్ల వారీగా ఉన్న సివరేజీ లేన్లను జనవరి నాటికి కంప్లీట్చేస్తామని చెప్పినా 500 కిలోమీటర్ల మేర కూడా సర్వే పూర్తి కాలేదు. మార్చిలోగా 5 వేల కిలోమీటర్లు పూర్తవుతుందని చెప్పిన అధికారులు లాక్ డౌన్ కారణంతో మ్యాపింగ్ ప్రాసెస్ఆగిపోయిందని చెప్తున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈసారి బోనాల పండుగ లేనట్లే
నిజంగానే రాజ్భవనం
అరటిపండ్లు అమ్ముతున్న టీచర్