తిరుమలలో అల్పాహారం, అన్న ప్రసాదం పంపిణీపై చర్యలు

తిరుమలలో అల్పాహారం, అన్న ప్రసాదం పంపిణీపై చర్యలు

తిరుమల:  కరోనా తర్వాత తిరుమలకు భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నందున పీఎసీ 1 , పీఎసీ 2,రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అల్పాహారం, అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి. గురువారం టీటీడీ పరిపాలన భవనంలో అన్న ప్రసాదం విభాగంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ..  భక్తుల సంఖ్య పెరుగుతున్నందున వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మాతృశ్రీ తరిగొండ అన్న ప్రసాద కేంద్రం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని వంటశాలల్లో ఆధునిక వంటసామగ్రి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.

అన్న ప్రసాదం విభాగం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటిదాకా దశల వారీగా అన్న ప్రసాదం అందిస్తున్న భక్తుల సంఖ్య, సేవలు ఎలా పెరుగుతూ వచ్చాయనే విషయంపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కోవిడ్ సమయంలో బాధితులకు, లాక్డౌన్ సమయంలో పేదలు, కూలీలకు లక్షలాదిమందికి అన్న ప్రసాదం పంపిణీ చేసిన వివరాలను తెలియజేశారు.