కాంగ్రెస్ లో చేరిన కందర్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు

కాంగ్రెస్ లో చేరిన కందర్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు

మద్నూర్, వెలుగు: జుక్కల్​ నియోజకవర్గం పరిధిలోని కందర్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్ద కొడప్​గల్​లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ జుక్కల్ నియోజకవర్గ ఇన్​చార్జి​ సౌదాగర్ గంగారం వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గంగారం, మల్లేశ్, శివరాం, లక్ష్మణ్, జె.అనిల్, ఫరీద్, ఫెరోజ్​తదితరులు ఉన్నారు.

కార్యక్రమంలో నియోజకరవ్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు అరవింద్, ఉపాధ్యక్షుడు రవి, లీడర్లు​ అజ్జు, సుభాష్​ పటేల్ తదితరులు పాల్గొన్నారు.