శేరిలింగంపల్లిలో భారీ మెజార్టీతో గెలుస్తా :  అరికెపూడి గాంధీ

శేరిలింగంపల్లిలో భారీ మెజార్టీతో గెలుస్తా :  అరికెపూడి గాంధీ

చందానగర్, వెలుగు: శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో భారీ మెజార్టీతో గెలిచి గులాబీ జెండాను మరోసారి ఎగరేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చందానగర్ డివిజన్ పరిధి శంకర్​నగర్​లోని వినాయక దేవాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్​తో పాటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఆయన ప్రచారం నిర్వహించారు.

కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం కేసీఆర్ కు తన విజయాన్ని కానుకగా ఇస్తానన్నారు. అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమం దక్కేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందన్నారు.