రేవంత్ లాంటోళ్లను ఎంతో మందిని చూశాం: కేటీఆర్

రేవంత్ లాంటోళ్లను ఎంతో మందిని చూశాం: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతున పాతిపెడతామన్న సీఎం రేవంత్  వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ను   100 మీటర్ల లోపల పాతిపెట్టడం కాదు.. ముందు  వంద రోజుల్లో ఇచ్చిన  హామీలు నెరవేర్చడంపై దృష్టిపెట్టాలని సూచించారు.  రేవంత్ లాంటి వారిని బీఆర్ఎస్ ప్రస్థానంలో చాలామందిని చూశామన్నారు. 25 ఏళ్లుగా నిలబడి, నీలాంటి వారిని ఎంతో మందిని మట్టికరిపించామన్నారు. బీఆర్ఎస్ ను ఎందుకు బొందపెట్టాలో చెప్పాలని ప్రశ్నించారు. 

లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్  బీజేపీ  కలిసిపోతాయన్నారు. రేవంత్ కాంగ్రెస్ ఏక్ నాథ్ షిండేగా మారుతారని ఆరోపించారు.  రేవంత్ తెలంగాణ చోటా మోదీ అని ఎద్దేవా చేశారు. రేవంత్ రక్తమంతా బీజేపీదే..  అదానీ,రేవంత్ ఒప్పందాల అసలు లోగుట్టు బయటపెట్టాలన్నారు.  జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజలెవరూ కట్టొద్దన్నారు.  కరెంట్ బిల్లులను 10 జన్ పథ్ లోని సోనియాగాంధీ ఇంటికి పంపాలన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ను ప్రభుత్వం వెంటనే  ఇవ్వాలన్నారు.  హామీలుఅమలు చేయకపోతే వదిలిపెట్టేది లేదన్నారు.  

Also Read :  అప్పుడు నిధులివ్వకుండా.. . కేటీఆర్ ఇప్పుడు నీతికథలు చెబుతున్నారు