
- కేసీఆర్ ఫ్యామిలీలో వారసత్వ చిచ్చు
- మరో షర్మిల కాబోతున్న కవిత
- ఆ లేఖ ఆస్తుల పంచాయితీనా?... రాజకీయ పంచాయితీనా?
- బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఈ డ్రామాల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు కనిపిస్తోందని అన్నాడు.
ఇవాళ ( మే 23) ఆయన మీడియాతో మాట్లాడుతూ, కవిత లేఖ కాంగ్రెస్ కు సంబంధించిన పత్రిక టీవీ లలో వార వచ్చిందని అన్నారు. మరోవైపు కవితను బయటకు పంపించడం కోసం బావా... బామ్మర్థులు ఒక్కటి అయ్యారని అన్నారు. ఈ సంకేతం వాళ్ల మీటింగ్ ద్వారా అందరికీ అర్థమయిందన్నారు. కవిత మరో షర్మిల కాబోతున్నదని జోస్యం చెప్పారు మెదక్ ఎంపీ రఘనందనరావు. ఇప్పుడు కవితతో పార్టీ పెట్టించి తర్వాత కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నం జరగబోతోందని చెప్పారు. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్రావు.